VIDEO: కంభంలో వ్యక్తి ఆత్మహత్య
ప్రకాశం: కంభం పట్టణంలోని పూసల బజారులో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శీలం రాజా (31) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు రాజాను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.