ధ్యానమందిరం చోరీ కేసులో ఇద్దరు అరెస్టు: సీఐ
VZM: గత నెల 5 న బొబ్బిలి మండలం పిరిడిలో శాకాంబారి మాత ధ్యానమందిరంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందుతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు CI కె.సతీశ్ కుమార్ ఆదివారం తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు సీతానగరం మండలానికి చెందిన పోల భాస్కరరావు, శ్రీకాకుళం జిల్లా హిరమండలమునకు చెందిన సవర సూర్యంను ఆరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసామన్నారు.