ఈ నెల 3న మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం మూసివేత
W.G: ఈ నెల 3వ తేదీన కేతుగ్రస్త చంద్ర గ్రహణం సందర్భంగా మావుళ్లమ్మ ఆలయాన్ని మూసివేసి, 4వ తేదీన తెరుస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. 3వ తేదీ పౌర్ణమి జరిగే చండీ హోమం ఉదయం 6 గంటలకు మొదలై 9 గంటలకు ముగుస్తుందని అన్నారు. మూడో తేదీ ఉదయం 9 గంటలకు ఆలయం మూసి, 4వ తేదీ ఉదయం 8 గంటలకు అమ్మవారి మూలవిరాట్ దర్శనానికి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు.