పెషావర్ కాన్సులేట్ను మూసివేస్తున్న అమెరికా
పాక్లోని పెషావర్ కాన్సులేట్ను శాశ్వతంగా మూసివేయాలని అమెరికా భావిస్తోంది. దీని వల్లే ఏటా 7.5 మిలియన్ డాలర్లను ఆదా చేయొచ్చని ఆ దేశ కాంగ్రెస్కు ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ యుద్ధం వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదని.. ఏడాదికిపైగా ఈ అంశం పరిశీలనలో ఉన్నట్లు చెప్పింది. దీనిని మూసివేస్తే ఇకపై అమెరికన్ పౌరుల సేవలను ఇస్లామాబాద్లోని ఎంబసీ నిర్వహిస్తుందని పేర్కొంది.