'ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్చండి'

'ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్చండి'

ప్రకాశం: యూటీఎఫ్ ఆధ్వర్యంలో “ప్రభుత్వ బడిలో విద్యార్థులు చేర్పిద్దాం – ఊరి బడిని కాపాడుకుందాం” కార్యక్రమం భాగంగా శుక్రవారం కనిగిరి మండలం కొత్తపల్లిలో ఎన్‌రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు.