CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

BPT: కూటమి పేదల ప్రభుత్వమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 218 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 5 మందికి ఎల్వోసీ పత్రాలు అందజేశారు. పేదవాడి ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.