సొంత గ్రామంలో ఝాన్సీరెడ్డికి బిగ్ షాక్
MHBD: సొంత గ్రామంలో TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి, MLA యశస్వినీ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెర్లపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారు బలపరిచిన అభ్యర్థి ధర్మారపు కిరణ్పై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ ఘన విజయం సాధించారు. 80 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా.. గతంలో మహేందర్ ఉప సర్పంచ్గా గ్రామానికి సేవలు అందించారు.