VIDEO: ముసుగు దొంగల హల్చల్
CTR: ఎస్ఆర్ పురం మండలం మర్రిపల్లి గ్రామంలో ముసుగు దొంగలు నిన్న రాత్రి హల్చల్ చేశారు. స్థానికుల కథనం మేరకు.. మర్రిపల్లి గ్రామానికి చెందిన హరి నాయుడు ఇంట్లో తలుపులు, తాళాలను పగలగొట్టి సుమారు లక్ష రూపాయలు చోరీ చేసి పరార్ అయ్యారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సీసీ కెమెరాల ఆధారంగా వారు దర్యాప్తు చేస్తున్నారు.