స్కూల్ ఐడి కార్డ్ ట్యాగ్తో విద్యార్థి ఆత్మహత్య
HYD: 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న చందానగర్లో జరిగింది. రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలోని ప్రశాంత్(9) అనే బాలుడు ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లోని బాత్రూంలో స్కూల్ ID కార్డ్ ట్యాగ్తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.