శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన మంత్రి

సత్యసాయి: గోరంట్ల పాత బస్టాండ్ ఆవరణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఇవాళ భూమి పూజ చేశారు. మహారాజు పెనుకొండను రెండో రాజధానిగా ఎంచుకుని పాలించారని, ఆయన కట్టించిన 365 దేవాలయాలు అతని ఘనతకు నిదర్శనమన్నారు. త్వరలోనే సొంత నిధులతో విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆమె తెలిపారు.