VIDEO: రైలు దిగుతూ జారిపడి వ్యక్తి మృతి
PLD: సత్తెనపల్లి రైల్వే స్టేషన్లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు కిందపడి స్కూల్ రికార్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. ఫిరంగిపురం గ్రామానికి చెందిన సింగరయ్య రెంటచింతల సెయింట్ జోసెఫ్ పాఠశాలలో రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో రైలు దిగుతూ కాలుజారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.