నరసరావుపేటలో ఎస్పీ గ్రీవెన్స్కు 95 ఫిర్యాదులు
PLD: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని పల్నాడు అదనపు ఎస్పీ సంతోష్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో ఆయన ప్రజల నుంచి 95 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో ఆస్తి, ఆర్థిక, కుటుంబ సమస్యలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయన్నారు.