తిరుపతి SVUకు నిధులు విడుదల
TPT: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(SVU)కి ప్రభుత్వం రూ.18.85 కోట్ల అదనపు గ్రాంటును విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు వెల్లడించారు. విశ్వవిద్యాలయం జీతభత్యాల కోసం నిధులు కేటాయించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.