ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునిగా నరేష్
హన్మకొండలోని రాంనగర్లో ఉన్న వేదాంతు లర్నింగ్ సెంటర్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరకాల పట్టణానికి చెందిన ఏకు నరేష్, ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ పురస్కారంను తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ చేతుల మీదుగా 2025లో అందుకున్నారు.