సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ
కోనసీమ: పేద, మధ్యతరగతి వర్గాల్లో అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించని వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం అమలాపురంలో తన కార్యాలయం వద్ద 17 మందికి మంజూరైన రూ.19.92 లక్షల విలువైన చెక్కులు అందజేశారు.