ఈనెల 14న రామప్ప సందర్శన నిలిపివేత

MLG: ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో రామప్పలో ఈనెల 14న పర్యాటకుల సందర్శన పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ములుగు కలెక్టర్ దివాకర తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణుల్లో 35 మంది రామప్ప వస్తున్నందున పాలంపేట ఆర్చీ లోపలికి మ.2 గంటల తర్వాత ఎవరికీ అనుమతి లేదన్నారు. దాదాపు 5కి.మీ వరకు డ్రోన్ కెమెరాలను ఎగరవేయడం నిషేధమని శనివారం ఆయన తెలిపారు.