VIDEO: పీజీఆర్ఎస్కు 116 అర్జీలు
SKLM: అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి శాఖ తదితర శాఖలకు సంబంధించి 116 అర్జీలయె స్వీకరించినట్లు తెలిపారు.