మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్న DY.CM

మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్న DY.CM

కోనసీమ: అంతర్వేదిలో రూ.17.33 కోట్ల జేజేఎం నిధులతో నిర్మించిన మంచినీటి పథకాన్ని ఈనెల 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించనున్నారని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. సఖినేటిపల్లెలో ఆయన మాట్లాడారు. దీని ద్వారా అంతర్వేది, గొంది సహా నాలుగు గ్రామాలకు రోజుకు 30 లక్షల లీటర్ల శుద్ధ జలం అందుతుందని పేర్కొన్నారు. దీంతో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.