సబ్ కోటా కల్పించినప్పుడే మహిళలకు సంపూర్ణ న్యాయం: కవిత
HYD: కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారని, దీనివల్ల మహిళలకు నష్టం జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ.. 2027 జనాభా గణనలో ఓబీసీలను లెక్కించాలని, మహిళా కోటాలో ఓబీసీలకు సబ్ కోటా కల్పించినప్పుడే మహిళలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.