రియాజ్ ఎన్కౌంటర్పై NHRCకి ఫిర్యాదు
NZB: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో రౌడీషీటర్ రియాజ్ను పోలీసులు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై రియాజ్ కుటుంబీకులు శుక్రవారం ఢిల్లీలోని NHRC, NCW, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లకు ఫిర్యాదు చేశారు. అతనిది బూటకపు ఎన్ కౌంటర్ అని కస్టోడియల్ డెత్ తర్వాత బుల్లెట్లు దింపి ఎన్ కౌంటర్గా చిత్రీకరించారని ఆరోపించారు. అలాగే ప్రమోద్ని కూడా రియాజ్ చంపలేదన్నారు.