పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు DPRకు టెండర్లు
AP: పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు DPR తయారీకి రూ.9.10 కోట్లతో జలవనరులశాఖ టెండర్లు పిలిచింది. ఈనెల 27 నుంచి ఆన్లైన్లో టెండరు దరఖాస్తులు దాఖలు చేయాల్సి ఉంటుంది. డిసెంబరు 11 సాయంత్రం 4 గంటల వరకు టెండర్లకు గడువు ఇచ్చారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్ తెరుస్తారు. డిసెంబరు 17న ప్రైస్ బిడ్ తెరిచి గుత్తేదారును ఎంపిక చేస్తారు.