రాంజల చెరువుకు జలకళ.. రైతులు హర్షం
KRNL: ఆదోని జీవనాడి అయిన రాంజల చెరువు ఒకప్పుడు వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన వనరు. ప్రస్తుతం వర్షాకాలంలో ఈ చెరువు నిండటం వల్ల భూగర్భ జలాలు పెరిగి, పరిసర ప్రాంతాల్లోని బావులు, బోర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. తద్వారా అటు వ్యవసాయానికి, ఇటు తాగునీటి అవసరాలకు ఈ చెరువు ఎంతో ఆసరాగా నిలుస్తోంది.