VIDEO: రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: MLA
SKLM: కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ బగ్గు వాని పేటలో నిర్మిస్తున్న రహదారి పనులకు ఆయన ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా రూ.12 లక్షల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు.