అమాంతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో పాక్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పెట్రో ధరలను పాక్ ప్రభుత్వం అమాంతం పెంచేసింది. పెట్రోల్, డీజిల్పై ఏకంగా రూ.55 పెంచింది. ఫలితంగా దాయాది దేశంలో లీటర్ పెట్రోల్ రూ.321, డీజిల్ రూ.336కు చేరింది. ప్రస్తుతం పాక్ వద్ద 10 రోజులకు సరిపడా ముడి చమురు ఉండడంతో భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.