టీటీడీకి అశోక్ లేల్యాండ్ మినీ ట్రక్ విరాళం
TPT: టీటీడీకి అశోక్ లేల్యాండ్ సంస్థ రూ.8.75 లక్షల విలువైన మినీ ట్రక్ను విరాళంగా అందించింది. శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఏరియా మేనేజర్ మహ్మద్ నజీరుద్దిన్ హాజరయ్యారు. అనంతరం వాహన తాళాలను టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు.