నేడు కంగ్టిలో నీటి సరఫరాకు అంతరాయం

SRD: మండల కేంద్రమైన కంగ్టిలో నేడు నీటి సరఫరా ఉండదని పంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆదివారం తెలిపారు. మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ లీకేజీ కారణంగా నీటి సరఫరాకు అంతరాయం కలిగినట్లు చెప్పారు. కంగ్టిలోని శ్రీకృష్ణ మందిర్, శ్రీరామ మందిరం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ పరిధిలోని ఆయా కాలనీలకు నీటి సరఫరా నిలిచినందుకు ప్రజలు సహకరించాలని పంచాయతీ కార్యదర్శి కోరారు.