ప్రజలకు న్యాయం చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత: ఎస్పీ
CTR: చిత్తూరు జిల్లా పోలీసుల పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో 41 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ, డబ్బు, కుటుంబ తగాదాలు వంటి వివిధ సమస్యలు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం విచారించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు న్యాయం చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్పీ తెలిపారు.