VIDEO: తిరుచానూరులో వైభవంగా రథోత్సవం
TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం రథోత్సవం నిర్వహించారు. ముందుగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు చేపట్టారు. అమ్మవారిని ముత్యపు చీరతో అలంకరించి రథంపై కొలువుదీర్చారు. ఉదయం 9.15 గంటలకు ధనుర్ లగ్నంలో అమ్మవారి రథోత్సవం ప్రారంభమైంది.