VIDEO: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్.. నీరు వృధా
SRD: ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామ శివారులో నేడు మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ వల్ల నీరు ఎగిసిపడుతున్నాయి. దీంతో తాగు నీరు అంతా వృధా అవుతున్నాయి. దారి పొడుగునా వెళ్లే స్థానికులు ఈ సమస్యపై సంబంధిత అధికారులకు తెలిపినా స్పందించడం లేదన్నారు. తక్షణమే పైపులైన్ మరమ్మతు చేసి నీటి వృధాను అరికట్టాలని కోరుతున్నారు.