గోదావరి మోక్ష దామం నిర్మాణానికి భూమి పూజ

గోదావరి మోక్ష దామం నిర్మాణానికి భూమి పూజ

W.G: పెనుగొండ మండలంలోని సిద్ధాంతం ఘాట్ వద్ద గోదావరి మోక్ష దామం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భూమి పూజ నిర్వహించారు. సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో, 62 సెంట్ల విస్తీర్ణంలో ఈ మోక్ష దామం నిర్మించనున్నారు. స్థానిక ప్రజలకు అంత్యక్రియల కోసం శుభ్రమైన, సక్రమమైన ఆధునిక సౌకర్యాలు కల్పించబడతాయని వారు చెప్పుకొచ్చారు.