విద్యుత్ షాక్తో పాడి గేదె మృతి
MHBD: విద్యుత్ షాక్తో పాడి గేదె మృతి చెందిన ఘటన గార్ల మండలంలోని ముల్కనూరు జిపి దుబ్బగూడెంలో జరిగింది. గురువారం బాధిత రైతు యలమంచిలి శివకుమార్ మాట్లాడుతూ.. పాడిగేదెను రోజు లాగానే నిన్న సాయంత్రం గడ్డి మెసేందుకు వెళ్లినట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి రూ.30 వేల విలువైన గేదె మృతి చెందిందని, అధికారులు స్పందించి, న్యాయం చేయాలని కోరారు.