21 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
JGL: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తోట రమేశ్ తన సమీప అభ్యర్థి సత్తయ్యపై 21 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయం పట్ల కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.