డీకేపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక సీఎం మార్పు వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే, సీఎం సిద్ధరామయ్య తమ బలాలను నిరూపించుకోవడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో మునిగిపోయారని ఆరోపించారు. అందుకే డీకే శివకుమార్ బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిశారని తెలిపారు.