డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన అధ్యక్షుడు

డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన అధ్యక్షుడు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా తూంకుంట మున్సిపల్ పరిధిలోని శామీర్‌పేట్‌లో రూ. 55.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులకు శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఈ డ్రైనేజీ వ్యవస్థ అత్యవసరమని, మున్సిపల్ నిధులతో పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు.