బస్సు ప్రమాద మృతులకు మంత్రి సంతాపం

బస్సు ప్రమాద మృతులకు మంత్రి సంతాపం

SRD: చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ప్రకటనలో సంతాపం తెలిపారు. బస్సు ప్రమాదంలో గాయపడి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. అవసరం అయితే హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించాలని పేర్కొన్నారు.