'రైతులను ఆదుకోవడంలో కూటమి విఫలం'

KRNL: ఎమ్మిగనూరులో గురువారం YCP మండల అధ్యక్షులతో జిల్లా YCP ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరతను సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. యూరియా టీడీపీ నాయకుల కాంపౌండ్లలో దాచిపెట్టి అధిక రేట్లకు అమ్ముతున్నారని ఆరోపించారు.