బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనుల పరిశీలన
KRNL: ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్యాంక్ మరమ్మతులు నీటి నిల్వ సామర్థ్యం పెంపు పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ అభివృద్ధితో రైతులకు సాగునీటి లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు, స్థానిక నాయకులు ఉన్నారు.