విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.లక్ష

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారిని మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి మంగళవారం వివిధ సేవల ద్వారా రూ.1,00,091 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 147 మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. 1600 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.