VIDEO: ఆక్రమించిన దుకాణాలను తొలగించాలి: కమిషనర్
CTR: చర్చి వీధి నుంచి మార్కెట్ వరకు ఫుట్ పాత్ను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించాలని చిత్తూరు కమిషనర్ నరసింహ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ నిత్య బాబు ఆదేశించారు. గురువారం ఆ ప్రదేశాలలో ఆయన పర్యటించారు. ఫుట్ పాత్ విస్తీర్ణం పెంచి ద్విచక్ర వాహనాలు పార్కు చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు.