అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి
WGL: ఇంతజార్గంజ్ పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మంచాల సురేష్ మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సీపీ అంత్యక్రియల నిమిత్తం రూ. 30వేలు దక్షిణ సాయం ప్రకటించారు. ఈ డబ్బును పోలీస్ సిబ్బంది కాశిబుగ్గలోని వారి నివాసానికి వెళ్లి అందచేశారు.