VIDEO: చేనేత భవన్లో మంత్రి ఆకస్మిక తనిఖీ
HYD: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నాంపల్లిలోని చేనేత భవన్లో ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పదిన్నర వరకు కొందరు ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి సమయానికి విధులకు హాజరు కానీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.