కామవరపుకోట VOA లకు స్మార్ట్ ఫోన్‌లు పంపిణీ

కామవరపుకోట VOA లకు స్మార్ట్ ఫోన్‌లు పంపిణీ

ELR: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ కామవరపుకోట మండలానికి చెందిన 53 మంది VOAలకి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం మహిళలకు చేరువ కావడం ఎంతో అవసరమని అన్నారు.