ఆకివీడు మండల పరిషత్ సమావేశంలో సమస్యల వెల్లువ

ఆకివీడు మండల పరిషత్ సమావేశంలో సమస్యల వెల్లువ

W.G: ఆకివీడు మండల పరిషత్ సమావేశంలో సమస్యలను చెబుతున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు సర్పంచ్, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీపీ కటారి జయలక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్ సమావేశం నిర్వహించారు. రహదారులు, సాగునీరు తాగునీరు, తదితర అంశాలపై సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశాలు నామమాత్రంగా జరుగుతున్నాయని పలువురు పెదవి విరిచారు.