ఏఆర్ ఎస్సై మహేశ్వర్ రెడ్డి మృతి
సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వర్ రెడ్డి గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి గురువారం అనంతపురంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. లక్ష అందజేశారు. ఎస్పీ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.