VIDEO: కైలాసగిరికి పోటెత్తిన జనం
VSP: పరమ పవిత్రమైన కార్తీక మాసం, పైగా ఆదివారం సెలవు దినం కావడంతో విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలు జన సందోహంతో కళకళలాడాయి. ముఖ్యంగా కైలాసగిరికి సందర్శకులు, నగరవాసులు భారీ సంఖ్యలో పోటెత్తారు. కార్తీక మాసంలో విశేష ప్రాధాన్యం ఉన్న వన సమారాధనల కోసం కుటుంబాలు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున కైలాసగిరి పార్కుకు తరలివచ్చారు.