'మీ పిల్లలపై నిఘా పెట్టండి'
ప్రకాశం: ఈతకు వెళ్లకుండా మీ పిల్లలపై నిఘ ఉంచాలని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో మీ పిల్లలు మీ ప్రాంతాలలో ఉన్న బావులు, చెరువులు, వాగులు, ఉపాధి హామీ పథకంలో తవ్విన గుంటలలోకి ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. గతంలో చిన్నారులు మృతి చెందిన సంఘటనలను గుర్తు చేస్తూ ఈ హెచ్చరికలు జారీ చేశారు.