'మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి'
SKLM: మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా UTF సహాధ్యక్షురాలు ధనలక్ష్మి కోరారు. గురువారం కలెక్టరేట్లో జేసీ పర్మాన్ అహ్మద్ ఖాన్ను కలిసి వినతి ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవులు, స్టాప్ రూం, మరుగుదొడ్లు ఏర్పాటు, మానసిక ఒత్తిడి నియంత్రణకు కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు తదితర సౌకర్యాలు అవసరమన్నారు.