చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధికి భారీ విరాళం
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం బెంగళూరు పట్టణానికి చెందిన కేఎస్. రమేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు రమేష్ కుటుంబ సభ్యులు రూ.3,50,000 వేల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు వారు అందజేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను ఇచ్చారు.