ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న కలెక్టర్
WNP: పెబ్బేరు మండలంలో 364 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. పెబ్బేరులో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. 6,737 మంది మహిళలకు ఏకరూప చీరలు పంపిణీ చేశామన్నారు. 1144 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1.81 కోట్లు వడ్డీ లేని రుణాలను అందించామన్నారు.