వరల్డ్ కప్.. విజృంభిస్తున్న యువ భారత్
తమిళనాడులోని చెన్నై, మదురై వేదికలుగా జరుగుతున్న మెన్స్ జూనియర్(U21) హాకీ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు విజృంభిస్తోంది. తొలి మ్యాచ్లో 7-0తో చిలీపై విజయ సాధించిన యువ భారత జట్టు రెండో మ్యాచ్లో ఒమన్పై జయభేరి మోగించింది. దిల్రాజ్ 4.. అర్ష్దీప్, మన్మీత్ చెరో 3 గోల్స్తో రాణించడంతో 17-0 తేడాతో ఘన విజయం సాధించింది.